Crime ఝార్ఖండ్ రాష్ట్రం దుమ్కా జిల్లాలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి.. గత నెల ఆగస్టులో ఓ బాలికపై యువకుడు పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన దేశమంతా ఎంత అల్లకల్లోలం చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సంఘటన ఇంకా మర్చిపోకముందే మరో ఘటన జరిగి అందర్నీ షాక్ లోకి నెట్టింది.. 14 ఏళ్ల ఓ బాలికపై అత్యాచారం చేయత్మే కాదు.. ఆపై చెట్టుకు వేలాడదీసి చంపేశారని ఆమె తల్లి ఆరోపించింది..
జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది 14 ఏళ్ల బాలికను ఇలా చెట్టుకు కట్టి ఆమెను చంపెయ్యగా దీని వెనక అనేక నిజాలు బయట పడుతున్నాయి ఈ కేసులో నిందితుడిని అర్మాన్ అన్సారీగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణ రంగ కార్మికుడు అయిన నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసులో ఇంకా అసలు విషయాలు బయట పడాల్సి ఉంది.. ఆమెను తొలుత హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు ఉరివేశారా? లేక ఆమె ఎలా వేలాడదీసాక చనిపోయిందా అన్న విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దుమ్కా సివిల్ సర్జన్ మాత్రం బాలిక 8-10 నెలల గర్భవతి అని నిర్ధారించారు. దీంతో నిందితుడు అర్మాన్ అన్సారీపై వీలైనంత త్వరగా చార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సోమవారం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని సందర్శించనుంది.
బాధితురాలు దుమ్కాలో తన పిన్నితో కలిసి ఉండేది. ఈ క్రమంలో అన్సారీతో ఆమెకు సంబంధం ఏర్పడింది. అమ్మాయి గర్భం దాల్చడంతో ఆమె తనను పెళ్లి చేసుకోమని అన్సారీని కోరగా అతడు ఇందుకు అంగీకరించలేదు సరి కదా ఆమెను చంపేశాడని చెబుతున్నారు.