Crime రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లలని కూడా చూడకుండా జరుగుతున్న ఈ అగాయిత్యాలు చూస్తుంటే భయాందోళనగా ఉంది.. హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతమైన డబీర్పుర పోలీస్స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. చంచల్గూఢకు చెందిన ఓ మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక వయసు 13ఏళ్లు కాగా… ఆమెకు మత్తుమందు ఇచ్చి ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.
తొలుత బాలికను కారులో కిడ్నాప్ చేసిన యువకులు… మాయమాటల చెప్పి నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడే బాలికకు మత్తుమందు ఇచ్చి రెండ్రోలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను రోడ్డుపై వదిలేసి పరారయ్యారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో డబీర్పుర పోలీసులు కేసు నమోదు చేసి… నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వీరిద్దరూ బాధితురాలికి తెలిసిన వారే కావడం గమనార్హం.
చేతికి ఇంజెక్షన్ ఇచ్చిన ఆనవాళ్లున్నాయి: బాలిక తల్లి సెప్టెంబర్ 12న రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి మందులు కొనేందుకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదని… దాంతో పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె తల్లి చెబుతోంది. ఎంత వెతికినా పాప కనిపించకపోయేటప్పటికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని తెలిపారు ఛాదర్ఘాట్ దగ్గర బాలికను గుర్తించిన పోలీసులు ఇంటికి చేర్చారు… అప్పటికే నడవలేని స్థితిలో ఉందని, చేతికి ఇంజెక్షన్ ఇచ్చిన ఆనవాళ్లు ఉన్నాయంటూ బాలిక తల్లి వాపోతుంది. తమకు న్యాయం చేయాలని, నిందుతులను కఠినంగా శిక్షించాలని కోరుతోంది.