Crime వివాహితపై జరిగిన లైంగిక దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కామాంధుడు చేతిలో మహిళ లైంగిక దాడికి గురైన ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో జరిగింది.
బాధితురాలు నల్గొండ జిల్లా మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ కాలనీకి చెందిన మహిళగా తెలుస్తుంది.. ఈనెల 13వ తారీఖున ఆ మహిళ ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.. ఆ మహిళకు దూరపు బంధువైన గుండెబోయిన సైదులు ఆమె ఇంటికి వచ్చాడు కూర కావాలని అడగగా ఆమె ఇంట్లోకి వెళ్ళింది అనంతరం ఆమె వెనకే వెళ్లి ఆమె చేయి పట్టుకోగా ఆ మహిళ ప్రతిఘటించింది దీనితో కోపోద్రిక్తడైన సైదులు కడుపులో తన్ని లైంగిక దాడి చేశాడు.. అంతేకాకుండా అక్కడి నుంచి పరారయ్యాడు..
బాధితురాలు బాధతో బాధపడుతూ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు అప్రమత్తమయ్యారు ఆమె పక్కింట్లో ఉంటున్న మట్టమ్మ వెళ్లి చూడగా ఆమె రక్తస్రావంతో బాధపడుతూ ఉంది వెంటనే ఈ సమాచారాన్ని ఆమె భర్తకు తెలియజేయగా అతను ఆమెను ఆటోలో ఆమెను మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతుండగా శుక్రవారం బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మహిళల కోసం ఎన్ని చట్టాలు వస్తున్నా వారిపై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు.. రోడ్డుపై వెళ్తున్నప్పుడే కాదు ఇంట్లో ఉన్న కానీ వారికి రక్షణ లేకుండా పోతుంది