Crime News : హర్యానాలో దారుణం చోటు చేసుకుంది.. తొమ్మిదేళ్ల కొడుకు చూస్తుండగానే మానవ మృగాలు రెచ్చిపోయాయి.. కదులుతున్న రైలులో మహిళపై హత్యాచారం చేశారు..
ఫతేబాద్ జిల్లాలో రోహతకు నుంచి తోహనాకు వెళ్తున్న ఓ ఒంటరి మహిళపై కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. ముందు ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించగా.. ఆమె వారిని ప్రతిఘటించింది. ఈ నేపథ్యంలో వారు కోపంతో ఆమెను రైల్లో నుంచి బయటకు తోసేసి వీళ్లు కూడా దూకేశారు..
ఆమెతో పాటు ఉన్న తొమ్మిదేళ్ల కొడుకు ట్రైన్ లోనే ఉండిపోయాడు తోహనా స్టేషన్ రాగా అక్కడ దిగి ఏడుస్తూ అసలు విషయం తన తండ్రికి చెప్పగా ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.. దీంతో అసలు విషయం బయటపడింది. రైల్వే ట్రాక్ వెంట గాలింపు చేపట్టిన పోలీసులకి ఆమె డెడ్ బాడీ పొదల్లో కనిపించింది.. కాగా మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించిన వారిలో ఒక నిందితుడిగా సందీప్ (27)ను గుర్తించి అరెస్ట్ చేసినట్టు ఫతేబాద్ పోలీసు చీఫ్ అస్తా మోదీ తెలిపారు.