రామా నాయక్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం `రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టియఫ్పిసి సెక్రటరి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…“మగాడి దాష్టీకానికి ఆడవారు ఎలా బలవుతున్నారో దండు పాళ్యం గత సిరీస్ లో చూపించారు. కానీ ఈ రియల్ దండుపాళ్యంలో మహిళలు వారిపై జరిగే అకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేసారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ చూశాక ఒక కర్తవ్యం, ప్రతిఘటన, మౌనపోరాటం చిత్రాలు గుర్తొచ్చాయి. ఈ సినిమా ప్రతి మహిళ చూడాలి. ఇన్ స్పైర్ అవ్వాలి. రాగిణి యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేసింది. ఫిబ్రవరి 4న వస్తోన్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని“ అన్నారు.
ఈ కార్యక్రమంలో మానస, శ్యామ్ సన్, శేఖర్ నాయక్, సందీప్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
రాగిణి ద్వివేది, మేఘన రాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్ః కోయల్ బంజార, ఎమ్ బస్వరాజు నాయక్ (ఎక్స్ ఎమ్మెల్యే) ; పీఆర్వోః చందు రమేష్; నిర్మాతః సి.పుట్టస్వామి, దర్శకత్వంః మహేష్.