Movie ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా పార్ట్ 2 ఎదురుచూస్తున్నారు భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టింది అయితే ఈ సినిమాను 350 కోట్లతో తెరకెక్కించారు. ఇప్పుడు పార్ట్ వన్ కూడా అంతే బడ్జెట్ తో తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈ సినిమా లో సాయి పల్లవి నటించినుందని హాట్ టాక్ వినిపిస్తుంది ఇందులో ఒక పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ అవసరం ఉందని ఇందుకు సాయి పల్లవి సరిపోతుందని తనను తీసుకున్నారని వార్తలు హల్చల్ చేశాయి అంతేకాకుండా ఇందులో ఒక ట్రైబల్ లేడీ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంపై తాజాగా మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది ఇందులో సాయి పల్లవి నటించటం లేదని తేల్చి చెప్పేశారు అలాగే ట్రైబల్ క్యారెక్టర్ కూడా లేదని తేల్చేశారు పుష్ప సినిమాలో నటించిన క్యారెక్టర్లనే పుష్ప-2 లో కూడా తీసుకుంటారని తెలుస్తుంది. పుష్ప -2 ది రూల్’ ను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న స్టార్ట్ చేశారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటనకు అల్లు అర్జున్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆయన సరసన నటించిన రష్మిక నటించింది. అనసూయ, సునీల్ ప్రముఖ పాత్రల్లో నటించారు.