యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. రష్మిక మందన్న హీరోయిన్. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్కు విశేష స్పందన లభించింది.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకోగా ఈ మూవీ ట్రైలర్ను ఫిబ్రవరి 19న విడుదలచేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో శర్వా తన ఫ్యామిలీతో ఎంత ఆప్యాయంగా ఉంటారో చూపించారు. ఈ పోస్టర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది.నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు.
సాంకేతిక బృందం : దర్శకత్వం: తిరుమల కిషోర్, నిర్మాత : సుధాకర్ చెరుకూరి, బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, కొరియోగ్రఫర్: దినేష్, పీఆర్వో: వంశీ-శేఖర్.