ఘనంగా జరిగిన `శశి` ప్రీ రిలీజ్ ఈవెంట్…
ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం “శశి“. నాయికగా సురభి నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 19న గ్రాండ్గా విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కు వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి, యంగ్ హీరోస్ నాగశౌర్య, సందీప్ కిషన్, విశ్వక్ సేన్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో సురభి, రాశీ సింగ్, సాయి కుమార్, చంద్రబోస్, అనంత్ శ్రీరామ్, భాస్కర భట్ల తదితరులు పాల్గొన్నారు.
రానా మాట్లాడుతూ.. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం సాయి కుమార్ గారు. ఇప్పుడు అందరికీ ఆన్ లైన్ క్లాసులు తెలుస్తున్నాయ్. కానీ నాకు మాత్రం నా మొదటి చిత్రం నుంచి ఆన్ లైన్ క్లాసులున్నాయ్.. నా ఆన్ లైన్ క్లాసులు సాయి కుమార్ గారివే. ఆయన పిలిచిన నిమిషం నేను వచ్చేయాలి.. వేరే దారి లేదు. ఈ ఏడాది ఇండియన్ సినిమాను మొదలుపెట్టేసింది టాలీవుడ్. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ విజయ పరంపరలో శశి కూడా చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆదికి ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మార్చి 19న మాస్కులు వేసుకుని థియేటర్కు వెళ్లండి.. శశి సినిమాని ఎంజాయ్ చేయండి“ అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. హీరో ఆదికి అన్నీ కలిసి వచ్చాయ్. టీజర్ను చిరంజీవి గారు ట్రైలర్ను కళ్యాణ్ గారు విడుదల చేశారు. సిధ్ శ్రీరామ్ పాడిన పాట సూపర్ హిట్ అయింది. అన్నీ కలిసి వచ్చాయ్.. ఈ సినిమాలో సురభి అందంగా కనిపించింది.. శశి టీంకు ఆల్ ది బెస్ట్. మార్చి 19న అందరూ శశి సినిమాను చూడండి’ అన్నారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఆది అన్నా కాల్ చేశాడు.. సిగ్నల్ బ్రేక్ చేసి మరీ వచ్చాను. ప్రేమ కావాలి సినిమా కాలేజ్ బంక్ చేసి మరీ కూడా చూశాను.. అన్న నన్ను కాల్ చేసి పిలవడంతో ఆ రోజులన్నీ గుర్తుకు వచ్చాయ్.. కోవిడ్ తరువాత థియేటర్ల మీద ప్రేక్షకులు దాడి చేస్తున్నారు.. సినిమా పరిశ్రమ రికవరీ కాదని చాలా మంది అంటే నేను అందరితో ఫైట్ చేశాను.. కాని ఆడియెన్స్ రైట్ అని నిరూపించారు. ఈ సినిమాకు కూడా బాక్సాఫీస్ మీద దాడి చేయాలి` అని అన్నారు.
నాగశౌర్య మాట్లాడుతూ.. కోవిడ్ తరువాత పరిశ్రమ ఎప్పుడు కోలుకుంటుందా? అని చాలా ఆలోచించాం. మా పని అయిపోయిందనుకున్నాం.. ఆ డిప్రెషన్లోనే 8 ప్యాక్స్ కూడా చేశాను.. తెలుగోడిలా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. సినిమా రిలీజ్ అయితే తెలుగు ప్రేక్షకులు సినిమాకు వెళ్లినంతగా ఎవ్వరూ వెళ్లలేదు.. మీరిచ్చిన ఈ సపోర్ట్కు మేం ఎంత చేసినా తక్కువే. ఈ సినిమా హిట్ అవ్వాలని చాలా బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిర్మాత మా అన్నయ్యే..ఆ డబ్బులన్నీ నాకే వస్తాయి. ఆది.. అంత ఈజీగా డ్యాన్స్ ఎలా చేస్తారు? అనేది ఇప్పటికీ నాకు అంతు పట్టని విషయం. శశి సినిమా మరో ఛలో అవుతుంది. ఓ పాట హిట్ అయింది.. సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఒకే ఒక లోకం అనే పాట హిట్ అయింది.. శశి కూడా ఛలో కంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతీ నెల ఓ సినిమా వచ్చి గట్టిగా కొడుతోంది.. ఈ సినిమా కూడా కొట్టేయాలి.. మ్యూజిక్ డైరెక్టర్, రచయితలు అందరూ అద్భుతంగా చేశారు. శశి టీంకు ఆల్ ది బెస్ట్’ అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ – ‘తెలుగు ఇండస్ట్రీ రికవరీ అయింది ప్రేక్షకుల వల్లే. నా బర్త్ డే నాడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మ్యాచోగా ఉన్నావ్ అని చిరంజీవిగారు అన్నారు. అలా చెప్పడంతో హ్యాపీగా అనిపించింది. చిన్నప్పటి నుంచి నేను అమితంగా ఇష్టపడే వ్యక్తి ఆయన. తమన్, హరీష్ శంకర్, నాని నా పాటలను రిలీజ్ చేశారు. ట్రైలర్ను పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. అందరు హీరోల అభిమానుల సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన హీరోలందరికీ థ్యాంక్స్. డైరెక్టర్ శ్రీనివాస్ వచ్చి కథ చెప్పినప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాను. డీఓపీ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కెరీర్ బెస్ట్ సాంగ్ ఇచ్చిన అరుణ్కు థ్యాంక్స్. నాకు ఫస్ట్ టైం చంద్రబోస్ రాసిన ఈ పాట ఇంత సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. శశి కోసం పని చేసిన అందరికీ థ్యాంక్స్. మార్చి 19న ఈ మూవీ రాబోతోంది. అందరూ చూడండి’ అన్నారు.