Siddardh : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే రక్షిత అనే అమ్మాయితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మిత్రుల మధ్య హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగింది. రక్షిత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తుంది. రక్షిత ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తుందని సమాచారం. మాజీ మంత్రి, టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు.
ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున, అల్లరి నరేష్, సాయి రామ్ శంకర్, దిల్ రాజు ఫ్యామిలీ లతో పాల్గొన్నారు. అలాగే తరుణ్, వడ్డే నవీన్, శ్రీకాంత్, రానా, గౌతమ్, సిద్దార్థ్, అదిరిరావు హైదరి.. మరి కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో సిద్ధార్థ్, అదితీరావు హైదరీ కూడా ఉన్నారు. ఈ ఇద్దరూ జంటగా కలిసొచ్చి శర్వాకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సిద్ధార్థ్, అదితి ప్రేమలో ఉన్నారని కొన్నాళ్లుగా పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇలా ఇద్దరూ కలిసి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
‘మహా సముద్రం’ సినిమాలో ఈ ఇద్దరూ శర్వాతో కలిసి నటించారు. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పలువురు చెబుతున్నారు. గతేడాది అదితీరావు పుట్టిన రోజు సందర్భంగా సిద్ధార్థ్ ‘ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్’ అంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మధ్య అన్ స్టాపబుల్ షోలో వీరి ప్రేమ గురించి బాలకృష్ణ.. శర్వాను అడిగారు. ఇప్పుడు శర్వా ఎంగేజ్ మెంట్ కు కలిసి వచ్చిన సిద్ధార్థ్, అదితి జంట బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు. శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొత్త జంటకి టాలీవుడ్ ప్రముఖులతో పాటు, అభిమానులు. నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.