Politics కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీని వెళుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సందర్భంగా ఆయన బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు పై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ విషయంపై స్పందించారు వీర్రాజు..
శుక్రవారం బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన సోమ వీర్రాజు కన్నా లక్ష్మీనారాయణ తనపై చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా తనపై ఎంతో కాలం నుంచి ఈయన ఆరోపణలు చేస్తూ వస్తున్నారని తెలిపారు అయితే ఇప్పటివరకు ఈ విషయంపై తన స్పందించలేదని ఇక స్పందించాల్సిన అవసరం వచ్చిందంటే చెప్పుకొచ్చారు..
సాధారణ కార్యకర్తగానే తాను భాజపాలు చేరానని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు స్థాయికి వచ్చాను అంటూ చెప్పకు వచ్చారు ఇంతటి స్థాయికి రావడానికి నేను ఎంతో కష్టపడ్డానని దాన్ని బిజెపి అధిష్టానం గుర్తించిందని కూడా తెలిపారు. గత గురువారం కన్నా లక్ష్మీనారాయణ బిజెపికి రాజీనామా చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన ఆ పార్టీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు..
అయితే జనసేన పై పొత్తుపై స్పందిస్తూ తాము పొత్తులో వున్నామని పవన్ కల్యాణ్ విజయవాడ పర్యటనలో చెప్పారని సోము వీర్రాజు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 60శాతం వరకు నిధులు కేంద్రమే కేటాయిస్తోందని కానీ జగన్ ప్రభుత్వం మాత్రం నిధులు తమవేనని చెప్పడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు