Movies మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ శంకర్ మణిరత్నం కోసం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిన్న చెన్నైలో జరిగిన ఆడియో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్.. దర్శకుడు మణిరత్నంపై ప్రశంసల వర్షం కురిపించారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీయటంలో మణిరత్నం ముందుంటారని.. ఆయన ఒక లెజెండ్రీ డైరెక్టర్ అని అన్నారు. పాన్ ఇండియా మూవీలను పరిచయం చేసింది మణి రత్నమని అన్నారు. అంతేకాకుండా నాగార్జున నటించిన గీతాంజలి మూవీలో సాంగ్స్ చిత్రీకరించిన తీరు ఇప్పటికే తనకు అద్భుతంగా అనిపిస్తుందను చెప్పారు. ఆయన దర్శకత్వం నుండి ఎన్నో నేర్చుకోవచ్చని అన్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని.. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిన్న చెన్నైలో జరిగిన ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంకి తమిళ సూపర్స్ రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ వచ్చారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా చేసిన హర్షద్వానులతో అక్కడ అంతా దద్దరిల్లిపోయింది. తమ అభిమాన హీరోలు ఇద్దరినీ ఒకే స్టేజిపై చూసిన తమిళ ప్రేక్షకులు ఎంతో ఆనందపడ్డారు. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, జయం రవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.