Political విజయవాడలో జరిగిన జయహో బీసీ సభ విజయవంతం అవుతుంది.. దీంతో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి..
విజయవాడలో జరుగుతున్న బీసీ మహా సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరూ బీసీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.. ఈ సభకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి పలు కీలక ప్రకటనలు చేశారు.. ఈ సందర్భంగా జగన్ చేసిన పలుకీలక వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి మిగిలిన నేతలు అందరిని తనవైపు తిప్పుకునేలా జగన్ ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి..
అలాగే ఈ సభతో సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల కోసం ఎజెండాను సెట్ చేస్తున్నారు. ఇంకా సభ జరిగిన తీరు, దానిని మీడియా కవర్ చేసిన వైనం. ముందుగా జగన్ స్పీచ్ను గమనిస్తే ఆయన తన సంక్షేమ కార్యక్రమాల ఆధారంగానే మాట్లాడారు. అలాగే రాబోయే 18 నెలల్లో రాష్ట్రంలోనే యుద్ధమే జరగబోతుందని అన్నారు.. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీముల వల్ల అత్యధిక లబ్ధి పొందింది బీసీలేనని ఆయన తెలిపారు. నా బిసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ వర్గాలు అంటూ ఆయన ఉచ్చరించడం ద్వారా వారిని సొంతం చేసుకోవడానికి యత్నించారు. అయితే ఈ సభ విజయవంతం తో రాష్ట్రంలో మిగిలిన బిసినే అతను అందరూ వైఎస్ఆర్సిపి వైపు మొగ్గు చూపించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇదే గనక జరిగితే టిడిపి శ్రేణుల్లో భయం మొదలైనట్టే..