Viral ఈరోజుల్లో యువత నిద్రలేచింది మొదలు పడుకునే అంతవరకు సోషల్ మీడియాలోని కాలం గడుపుతున్నారు.. వీడియోలు అప్లోడ్ చేయడం వాటి వ్యూస్ పెంచుకోవడం కోసం తెగ ఆలోచిస్తున్నారు అయితే కొన్నిసార్లు ఈ దారిలో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక యువకుడు ఇలా చేసి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.. పట్టాల దగ్గరికి వెళ్లిన ముగ్గురు యువకులు వీడియో తీసుకోవాలనుకున్నారు.. ట్రైన్ వస్తుండగా ఒక అబ్బాయి నడుస్తూ ముందుకు రాగా.. మిగిలిన ఇద్దరు వీడియో తీస్తున్నారు. ట్రాక్ పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్న యువకుడికి ట్రైన్ పక్కగా వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఒక్కసారిగా ట్రైన్ అబ్బాయిని ఢీకొనడంతో పక్కనే ఉన్న రాళ్లపై ఎగిరిపడ్డాడు. దీంతో కంగారుపడిన మిగిలిన ఇద్దరు.. పరుగున వచ్చి లేపగా ప్రాణాపాయ స్థితిలో లేవలేక పడి ఉన్నాడు.. నొప్పితో విలవిలలాడుతున్న ఆ యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
వీడియోకు వ్యూస్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయకండి.. క్షణాల వ్యవధిలో ఈ అబ్బాయి..#ViralNews #ViralVideos #TrendingNewshttps://t.co/PgkxXgwnUv
— TV9 Telugu (@TV9Telugu) September 4, 2022
ఏవో వ్యూస్ పెంచుకోవడం కోసం చేసే ఇలాంటి పిచ్చి పనులు ఇప్పటికే ఎందరో ప్రాణాలను తీసాయి. సెల్ఫీలు తీసుకుంటూ నీటిలో పడిపోయిన సన్నివేశాలు.. ఇలా రైల్వే ట్రాక్లు వెంట నడుస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకున్న ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయినాప్పటికీ ఇలాంటి యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. చేతులారా నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటూ కన్నవారికి బాధనే మిగిలిస్తున్నారు..