Political రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావిస్తున్న మునుగోడులో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు శాయశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి కేటీఆర్…వరుస ట్విట్లతో భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్ట్ల కోసమే భాజపాలోకి వెళ్లారంటూ విమర్శలు చేసిన ఆయన… రూ.18 వేల కోట్ల కాంట్రాక్ని బీజేపీ అప్పగించిందంటూ పరోక్షంగా ట్వీట్ చేశారు. “ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయినంత మాత్రాన దేశం సంపద పెరగదు, మరొక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు. రాజకీయ ప్రయోజనం కాదు, నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోడీ గారు. గుజరాత్కు గత ఐదు నెలల్లో రూ.80,000 కోట్ల ప్యాకేజీలు. మా తెలంగాణకు కనీసం రూ.18,000 కోట్లు ఇవ్వలేరా ?” అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఒక కాంట్రాక్టర్ అహం కారణంగానే ఉప ఎన్నిక వచ్చిందంటూ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్కు కోకోనట్ బోర్డులు.. మనకేమో బోడి గుండ్లు అంటూ ఎద్దేవా చేశారు. ఇదే సందర్భంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గుజరాత్ వాళ్లొచ్చి రాజకీయాలు చేస్తుంటే.. తెలంగాణ బిడ్డ దేశంలో రాజకీయాలు చేయొద్దా? అంటూ ప్రశ్నించారు . పార్టీ జెండా, గుర్తు మారదని, ఎవరూ తికమక పడాల్సిన అవసరం లేదని అన్నారు.
Another BOARD to Gujarat
Yet Another FRAUD to Telanganaబోర్డులు గుజరాత్ కు…
"బోడిగుండు"లు తెలంగాణకా…?మోడీ గుండెల్లో గుజరాత్…
తెలంగాణ గుండెల్లో గునపాలా…??ఎన్నాళ్లీ దగా..? ఇంకెన్నాళ్లీ మోసం…? pic.twitter.com/PTQoYLwPRi
— KTR (@KTRBRS) October 8, 2022