Thalapathy Vijay : తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాగా స్నేహితుడు, తుపాకి, అదిరింది, విజిల్, బీస్ట్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా చేరువయ్యాడు. తాజాగా విజయ్ “వారసుడు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వారసుడు సినిమా తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తమిళనాడులో జనవరి 11న విడుదలైంది. తెలుగులో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. వారసుడు సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా 7 రోజుల లోనే 150 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 210 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది.
Triple ah received your love in 7 days nanba 🔥#MegaBlockbusterVarisu crosses 210Crs+ collection worldwide 😎#VarisuHits210Crs#Thalapathy @actorvijay sir @directorvamshi @SVC_official @MusicThaman @iamRashmika @7screenstudio @TSeries#Varisu #VarisuPongal pic.twitter.com/aVS6vGYhhY
— Sri Venkateswara Creations (@SVC_official) January 18, 2023
ఈ మేయర్కు నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత విజయ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.