Crime రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైల్లో ఉండే దొంగలు సెల్ ఫోన్లు, పర్సులు వంటివి దొంగలించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఇలాంటి ఓ సంఘటనే బీహార్ లో చోటు చేసుకుంది. అయితే ఆ దొంగకు ప్రయాణికులు తగిన బుద్ధి చెప్పారు..
సాధారణంగా బీహార్ లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతుంటాయి. అలాగే ఈ నెల 14వ తేదీన బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలు సాహెబ్పూర్ కమల్ స్టేషన్ మధ్యలో ఈ సంఘటన జరిగింది.. ఓ దొంగ ఓ ప్రయాణికుడి సెల్ ఫోన్ ను దొంగలించడానికి ప్రయత్నించాడు. రైలు ఆగి ఉంది కదా అని ఈ చోరీకి ప్రయత్నించి దొంగ బుక్ అయ్యాడు. ఎవరి దగ్గర అయితే సెల్ఫోన్ దొంగలించాలనుకున్నాడో.. ఆ ప్రయాణికుడు తెలివిగా కిటికీలోంచి ఆ దొంగ చేయి పట్టుకున్నాడు. ఎంత వదలమని ప్రయత్నించినా వదల్లేదు. ఇంతలో రైలు వేగం పెరిగింది.. అలాగే ఆ దొంగను పట్టుకొని పది కిలోమీటర్ల వరకు తీసుకుపోయాడు ఆ ప్రయాణికుడు. చివరికి పది కిలోమీటర్ల తర్వాత వదిలిపెట్టాడు. దీంతో ఆ దొంగ ఊపిరి పీల్చుకొని ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోయాడు..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన వారంతా సరైన శాస్తి జరిగిందని.. రైల్లో ఉండే దొంగలతో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.. అయితే ఎంతైనా రైలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం..
Though #unverified yet chilling. A mobile snatcher caught in a moving train when his failed attempt probably led to his worst day of life. The thief was hung by a window in a moving train from Begusarai to Khagaria. The passengers handed him over to GRP. IS this act justified? pic.twitter.com/o3ja5qWggi
— Saurabh Rathore (@JournoKSSR) September 15, 2022