Health ఎక్కిళ్ళు సాధారణంగా ప్రతి ఒక్కరిని ఎప్పుడో ఒకప్పుడు వేధించే సమస్య ఇది. అయితే ఈ సమస్య ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి వచ్చిన కాసేపటికి తగ్గిపోతే.. మరికొందని ఆపకుండా వేధిస్తూనే ఉంటుంది. కొందరు మంచినీళ్లు తాగటం.. కాసేపు ఊపిరి బిగ పెట్టడం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అవి ఆగిపోతాయి. కానీ మరికొందరిని చాలా ఇబ్బంది పెడతాయి. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం..
ఎక్కిళ్లు రావడానికి ప్రధాన కారణం ఛాతీని, కడుపును వేరు చేసే డయాఫ్రం పొర హఠాత్తుగా సంకోచించటం. దీంతో స్వరపేటిక కొద్దిసేపు మూసుకుపోయి ఒక రకమైన చప్పుడు వస్తుంది. అయితే వీటిని వెంటనే ఆపటానికి మనం వంటింట్లో దొరికే చాలా వస్తువులను ఉపయోగించుకోవచ్చు.. ఎక్కిళ్ళను ఆపటానికి యాలకులు మంచిగా పడతాయి. కొంచెం యాలకుల పొడిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే ఎక్కిళ్ళు వెంటనే ఆగుతాయి.. వీటిని అపటంలో మిరియాల పొడి కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. కొంచెం మిరియాల పొడిని వేడి నీటిలో వేసి తాగిన ఎక్కిళ్ళు ఆగిపోతాయి.. అలాగే ఓ చెంచా పంచదారని తీసుకొని.. చప్పరిస్తూ ఉంటే వాటికి అవే తగ్గిపోతాయి.
అయితే ఎక్కిళ్ళు ఆపకుండా వేధిస్తుంటే ఒక గ్లాసు నీళ్లు తీసుకొని వెంట వెంటనే తాగాలి.. లేదా ఊపిరి బిగబట్టిన మంచి ఫలితం ఉంటుంది.. రెండు రోజులకు మించి ఎక్కిళ్లు వేధిస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ సలహాను తీసుకోవాలి. శరీరంలో ఏదైనా సమస్య ఉంటే మాత్రమే ఇలా జరుగుతుంది అని గుర్తించాలి.