Crime రోజురోజుకు మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయి వీటి మాయలో పడి ఎందరో నిండు జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు చిన్నా పెద్దా అని కూడా చూడకుండా ఎంతటి దారుణానికైనా పొడిగాడుతున్నారు.. ఏ ముసుగులో ఎందరో అమాయకులు ప్రతిరోజు బలైపోతున్నారు. ఇలాంటి ఓ సంఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది..
ఢిల్లీలోని లోధీ కాలనీలో శనివారం అర్థరాత్రి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దేవుడు చెప్పాడు అంటూ ఇద్దరు యువకులు కలిసి ఒక ఆరేళ్ల చిన్నారి గొంతు కోశారు దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది ఇలా ఎందుకు చేశారని ఆ హంతకుల్ని ప్రశ్నించగా తమకు కలలో దేవుడు కనిపించి ఇలా చేయమని చెప్పాడని అనటం అందరిని షాక్ గురి చేసింది అంతేకాకుండా ఇలా చేయటం వల్ల తమకు మంచి జరుగుతుందని దేవుడు అన్నాడని చెప్తున్నారు..
ఈ విషయంపై విచారణ జరిపించిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కతిహార్కు చెందిన విజయ్కుమార్గా, బీహార్లోని సహర్సాకు చెందిన అమర్కుమార్గా పోలీసులు గుర్తించారు… నిందితులిద్దరూ సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇక్కడే చనిపోయిన చిన్నారి తండ్రి కూడా పని చేసేవాడు. అయితే చిన్నారి కుటుంబంతో తమకు ఎలాంటి విభేదాలు లేవని.. దేవుడు చెప్పాడని.. క్షణికావేశంలో ఆ చిన్నారి కనిపించడంతో అలా చేశామని నిందితులు తెలిపారు..