Health కొన్ని రకాల ఆకుకూరలు.. కాయగూరలు పచ్చిగా తింటేనే మంచిది. దీని వల్ల వాటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ డైరెక్ట్ గానే మనకు అందుతాయి. అంతే కాకుండా వాటితో పాటు పూర్తిస్థాయి పోషకాలను అందుకోవచ్చు. అయితే ఇది అన్ని కూరగాయలకు వర్తించదు. అన్నిటికీ ఓకే నియమం పనికిరాదు. కొన్నింటిని పచ్చిగా తినటం వల్ల లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఎక్కువగా ఉడికిస్తే వాటిలో ఉన్న పోషకాలు పోతాయి. అలా అని పచ్చిగా తింటే వాటిలో ఉన్న విటమిన్స్ మన శరీరాన్ని పూర్తిస్థాయిలో అందవు. అందుకే కూరగాయలు తగినంతగా మాత్రమే వేడి చేయాలి. పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే.. కడుపులో ఇన్ఫెక్షన్లు, అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పచ్చి కూరగాయల కన్నా ఉడికించిన కూరగాయలు తొందరగా జీర్ణం అవుతాయి. క్యారెట్ బీట్ రూట్ వంటి వాటిని జ్యూస్ చేసుకొని తాగొచ్చు.
మరి ముఖ్యంగా బచ్చలికూర, కాలీఫ్లవర్ వంటి వాటిని పచ్చిగా తీసుకోవడం వల్ల సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లను పెంచుతాయి. క్యాబేజీ, బ్రోకలీ వంటి వంటి కూరగాయలు పచ్చిగా తింటే.. థైరాయిడ్ గ్రంధిని నిరోధిస్తాయి. కడుపులో గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు పచ్చి కూరగాయలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అంతే కాకుండా కొన్ని పచ్చి కూరగాయల పైన వుండే ఉడికించినప్పుడు మాత్రమే పోతాయి.