ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రిమియర్స్ కు ప్రేక్షకుల నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
సుహాస్ మాట్లాడుతూ.. ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు ప్రిమియర్స్ చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. నా మొదటి థియేటర్ రిలీజ్ ఇది. సినిమా చూసిన చాలా మంది నన్ను దీవిస్తుంటే అనందంతో నాకు మాట రాలేదు. రేపటి కోసం ఎదురుచూస్తున్నాను. మా సినిమాతో పాటు వస్తున్న అన్ని సినిమాలు విజయాలు సాధించాలి’’ అన్నారు.