Political News : ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రాజకీయం వేడెక్కింది అని చెప్పుకోవాలి. అటు తెలంగాణలో ఎలక్షన్స్ దగ్గర పడడంతో ఎవరికి వారే తమ గొప్పలను చెప్పుకుంటూ పార్టీ గెలుపు కోసం తెగ శ్రమిస్తున్నారు. ఇంకా ఏపీ సంగతి కి వస్తే ఏపీలో కూడా ఎలక్షన్స్ జరగడానికి ఒక సంవత్సరం మాత్రమే గడువు ఉండటంతో పండిన పంట దగ్గరకు ఎలుకల గుంపు ఎలా చేరుతుందో అలా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు ఏపీ రాజకీయ నాయకులు. గత ఏడాది అత్యధిక సీట్లతో విజయం పొందిన వైయస్సార్ పార్టీ కూడా తమ పార్టీ గెలుపు కోసం తెగ శ్రమిస్తుంది. ప్రతిపక్షం పార్టీ అయిన టిడిపి కూడా వచ్చే ఎలక్షన్స్ కు సర్వం సిద్ధమవుతోంది. చూడాల మరి ఈ ఏడాది వచ్చే ఎన్నికలు వచ్చే ఏడాది ఎన్నికలు ఏ మలుపు తిరుగుతాయో అనేది.
శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్ పార్టీ నాయకులు టిడిపి కార్యాలయం ముట్టడికి వెళ్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ నేతలు బస్టాండ్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడుకు, నియోజకవర్గ ఇన్ఛార్జి గౌతు శిరీషకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు ర్యాలీగా బయలుదేరగా అక్కడి పోలీస్ బృందం వారిని అడ్డుకున్నారు. అయితే అప్పటికే పలాసలో 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సూర్యనారాయణ ఇళ్లను కూలగొట్టేందుకు ప్రయత్నించగా దానిని టిడిపి నాయకులు అడ్డుకున్నారు.