Crime గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.. వడోదర ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దర్జీపురా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ ట్రక్కు ఆటోను ఢీకొనడంతో ఆటోలో ఉన్న పదిమంది అక్కడికక్కడే చనిపోయారు.. మరో ఏడుగురు గాయాల పాలయ్యారు
గుజరాత్ రాష్ట్రం వడోదరలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో పదిమంది చనిపోయారు.. ఆటో పైకి ట్రక్ దూసుకెల్లడంతో ఈ దుర్ఘటన జరిగింది.. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు.. వడోదర ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దర్జీపురా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే చనిపోయారు.. సూరత్ నుంచి వస్తున్న కంటైనర్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముందు నుంచి వస్తున్న కారును ఢీకొట్టింది. అనంతరం కంటైనర్ అదుపుతప్పి రోడ్డు కు అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. అనంతరం ఎయిర్ ఫోర్స్ కాంపౌండ్ లోకి ఈ కంటైనర్ దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా 8 మంది మహిళలు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆటో నుజ్జునుజ్జు కావడంతో అగ్నిమాపక దళం, ఎయిర్ ఫోర్స్ బృందం గ్యాస్ కట్టర్ సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వాళ్ళిద్దరు పరిస్థితి విషమంగానే ఉంది.. ప్రమాదం అనంతరం 48వ నెంబరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.