కాబోయే అల్లుడికి రకరకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు అట్టింటి వారు. ఇందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 125 వెరైటీలు చేసేశారు. వాటిలో చాలా వంటకాల పేర్లే తనకు తెలీదని అల్లుడు నోరెళ్లబెట్టాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసా..
విజయనగరం జిల్లా ఎస్కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కొడుకు చైతన్యకు వైజాగ్కు చెందిన కలగర్ల శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతుల కూతురు నిహారికతో పెళ్లి కుదిరింది. వచ్చే ఏడాది మార్చిలో వీరికి పెళ్లి నిశ్చయించారు. అయితే నిశ్చయతాంబూలాలు కుదిరిన తర్వాత వచ్చిన మొదటి దసరా పండుగ అని అల్లుడిని ఇంటికి విందుకు ఆహ్వానించారు అట్టింటివారు. ఇందుకు ఏకంగా 125 రకాల పిండివంటలు స్వయంగా తయారు చేసి అల్లుడికి సర్ప్రైజ్ ఇచ్చారు. వాటన్నింటినీ చూసిన అల్లుడు అందులో చాలా వాటి పేర్లు తనకి తెలీదని నోరెళ్లబెట్టాడు. ఇందులో 95 రకాల బయట నుంచి తీసుకురాగా.. మిగతా వన్నీ ఇంట్లోనే తయారు చేశారు.