Crime : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు అకస్మాత్తుగా ఉన్మాదిలా మారిపోయాడు తన దగ్గర ఉన్న కారం అంతా బస్సులో ఉన్న ప్రయాణికుల మీద కుమ్మరించాడు దీంతో ఒకసారి షాక్కు గురైన ప్రయాణికులంతా పోలీసులకు సమాచారం అందించారు..
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా ఉన్మాదుల ప్రవర్తించాడు తోటి ప్రయాణికులు అందరూ పైన కారం చల్లి గందరగోళానికి గురి చేశాడు దీంతో ప్రయాణికులంతా ఒక్కరి బిక్కి ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అసలు విషయాలు తెలుసుకున్నారు..
పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు అనే యువకుడు వెళ్లాలి అనుకున్నాడు అయితే ఇందుకుగాను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లిన రాంబాబుకు పాస్పోర్టు, వీసా వివరాలు సరిగా లేకపోవడంతో ఎయిర్పోర్టు అధికారులు అతన్ని వెనక్కి పంపారు. దీంతో తిరుగు ప్రయాణం అయిన అతను హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో స్వగ్రామానికి బయల్దేరాడు. పాలకొల్లు పట్టణం సమీపంలోకి బస్సు రాగానే అతను ఆ కోపాన్ని అంతా అదిమి పెట్టలేక ఉన్మాదిలా మారిపోయాడు. గల్ఫ్ తీసుకెళ్లడానికి తనతో ఉంచుకున్న రెండు కేజీల కారాన్ని తోటి ప్రయాణికులు తో పాటు చిన్నపిల్లల పైన చల్లాడు దీంతో వాళ్ళందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి రావడంతో రాంబాబు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రయాణికులు పట్టుకొని పాలకొల్లు బస్ స్టేషన్ లో పోలీసులకు అప్పగించారు.