Crime రోజురోజుకు పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతున్నాయి అంటే అమ్మాయిలు బతకటానికి ఇంత భయపడాలా అనిపిస్తున్నాయి బయటే కాదు ఇంట్లో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది తాజాగా మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న ఓ దారుణ సంఘటన ప్రతి ఒక్కరిని నువ్వేర పరుస్తుంది..
అమ్మ అంటేనే ప్రేమకు ప్రతిరూపం ప్రపంచమంతా ఏకమై నిన్ను కష్టాలు పెట్టిన ఒడిలో చేర్చుకునే మనిషి అమ్మ అలాంటి అమ్మే కసాయిగా మారితే ఏం చేయగలం.. మధ్యప్రదేశ్లో నివాసం ఉంటున్న ఓ మహిళకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.. వీరి వయసు 12 14 16 గా ఉంది అయితే తన ముగ్గురు కుమార్తెలను ప్రియుడితో కలిసి విక్రయించడానికి ప్రయత్నించింది ఓ తల్లి ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయిలు తప్పించుకొని తమ తాతయ్య దగ్గరకు పారిపోయారు.. అక్కడినుంచి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది నిందితులందరూ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది..
ఈ బాలికల్లో ఇద్దరు పెద్ద బాలికలను రాజస్థాన్ నివాసితులకు ఒక్కొక్కరు రూ.4 లక్షల చొప్పున దంపతులు విక్రయించారని.. ఆ తర్వాత రాజస్థాన్లోని మరో వ్యక్తికి 12 ఏళ్ల చిన్నారిని రూ.1.75 లక్షలకు విక్రయించి పెళ్లి చేశారని మహిద్పూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఆర్కె రాయ్ చెప్పారు. .ఈ కేసులో ఐదుగురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 370, 376 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.