Entertainment అనవసరమైన బంధాల్లో ఇరుక్కొని జీవితాలను నాశనం చేసుకునే కన్నా.. ఒంటరి జీవితాన్ని గడపడం మేలని చెప్పుకొచ్చింది హీరోయిన్ సదా..
జయం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సదా పలు విభిన్న క్యారెక్టర్లతో తన అందంతో ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకొని కెరీర్లో ముందుకు దూసుకు వెళ్లిపోయింది అయితే అనుకోని పరిస్థితుల్లో సినిమాల నుంచి తప్పుకొని ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది అయితే ఈమె నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మాంసాహార సంబంధిత పదార్థాలను తీసుకోకుండా కేవలం శాకాహార పదార్థాలని తీసుకుంటూ ఉంటుంది అంతేకాకుండా ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతుంది.. అయితే అనవసరమైన బంధాల్లో చిక్కుకొని బాధపడే కన్నా ప్రశాంతంగా ఒంటరి జీవితాన్ని గడపడం మేలని చెప్పుకోస్తోంది..
“మనం ఎప్పుడూ కూడా మనకు ఇష్టమైన వారిని ఎక్కడ దూరం చేసుకుంటామా అని బాధపడుతూ ఉంటాము అయితే కొన్నిసార్లు మనకు ఎంతో దగ్గరగా ఉన్నవారు కూడా మనల్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు కేవలం మనది పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మనతో జీవితాంతం ఉండిపోతారు.. అలాగే కొందరి కోసం మనం ఎన్ని త్యాగాలు చేసిన వారికి ఎప్పటికీ గుర్తు ఉండదు. అంతేకాకుండా వారు మన జీవితంలో ఎదగటానికి కూడా సహకరించారు సరి కదా మన ఎదుగుదలకు అడ్డు వస్తూ ఉంటారు అలాంటి వారిని జీవితం నుంచి దూరం చేసుకోవడం చాలా మంచిది ఇంట్లో అక్కర్లేని వస్తువులను ఎలా అయితే తీసి బయట పడేస్తాము అలాగే జీవితంలో కూడా మనకు బాధ కలిగించే మనుషుల్ని దూరంగా ఉంచడం చాలా మంచిది.. ఎప్పుడు మన అంతరాత్మ చెప్పే విషయాన్ని మనం వినాలి. ఎందుకంటే చుట్టూ ఉన్న మనుషులు అందరూ ఏదో ఒక రోజు మన నుంచి దూరంగా వెళ్లిపోతారు. కానీ మనం మాత్రమే మనతో ఉంటాం అనవసరమైన బంధాల్లో కష్టంగా జీవించే కన్నా వాటి నుండి బయటకు వచ్చి ప్రశాంతంగా బతకడం మంచిదని..” చెప్పుకొచ్చింది సదా..