Actress Shriya : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ తనదైన నటనతో తెలుగునాట మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. యంగ్ హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ను సీక్రెట్గా పెళ్లాడింది శ్రియ. ఈ విషయాన్ని కూడా చాలా కాలం దాచిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరికి ఏడాది పాప ఉన్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ పాపకు రాధ అనే పేరు పెట్టినట్లు ప్రకటించింది. కాగా తన భర్త ఆండ్రూ తో కలిసి విహారయాత్రలు చేస్తూ సోషల్ మీడియాలో… శ్రియ పోస్టులు చేయడం అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో భర్తతో క్లోజ్గా దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రియ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈమె తాజాగా నటించిన ‘దృశ్యం2’ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్ర ప్రమోషన్స్లో అందరు చూస్తుండగానే తన భర్తకు లిప్ కిస్ ఇచ్చింది శ్రియ. దీంతో ఆ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ఫొటోను చూసిన కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో ఈ ట్రోలింగ్పై తాజాగా శ్రియ రియాక్ట్ అయ్యింది. ‘నా ప్రత్యేకమైన క్షణాల్లో నాకు ముద్దు పెట్టడం నా భర్తకు సరదా. నా వరకు ఇదొక అందమైన అనుభూతి. భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవడాన్ని ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ.. ఏం పర్వాలేదు. ఎందుకంటే నేను చెత్త కామెంట్స్ చదవను. వాటికి స్పందించను. ఎందుకంటే ట్రోల్స్ చేయడం వారి పని… వాటిని పట్టించుకోకపోవడం నా పని, నేను చేయాలి అనుకున్నదే చేస్తా’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చిందీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.