Viral video : నిత్యం సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఆనంద్ మహేంద్ర మరో వీడియోను పోస్ట్ చేశారు. దేశం అంతా వినాయక నిమజ్జనాలు జరుగుతున్న వేళ ఒక ఏనుగు తొండం ఊపుతున్న వీడియోను ట్విట్టర్ లో పంచుకొన్న మహేంద్ర గణేషుడికి ప్రత్యేకంగా వీడ్కోలు చెప్పారు..
దేశమంతా వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్ర బొజ్జ గణపయ్యకు విశేషంగా వీడ్కోలు తెలిపారు. ఒక చిన్న ఏనుగు పెద్ద ఎనుగ ముందు నిల్చోని తొండంతో ఆపకుండా వెళ్ళిపోమన్నట్టు తొండాన్ని ఊపుతుంది. ఈ వీడియోను ట్విట్టర్ లో పంచుకున్న మహేంద్ర “గణేషుడు తన తొండంతో మనకు వీడ్కోలు చెబుతున్నట్టు అనిపిస్తుంది.. వచ్చే సంవత్సరం కలుద్దాం.. గణపతి పప్పా మోరియా..” అంటూ ట్విట్టర్ లో వాక్యాలు జోడించారు.. అయితే ఈ వీడియోకు నేటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే ఈ వీడియోకు 20 మిలియన్లు దాటి వ్యూస్ వచ్చాయి అంటే అర్థం వీడియో ఫాలోయింగ్ ను అర్దం చేసుకోవచ్చు. అయితే ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
I think Bappa is bidding us goodbye with his trunk…and we say: Ganpati Bappa Morya, Pudhchya Varshi Lavkar Ya! See you next year… pic.twitter.com/SN7Z7uuEzC
— anand mahindra (@anandmahindra) September 10, 2022
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహేంద్ర మంచి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు.. సమాజానికి అవసరమైన ఎన్నో విషయాలు కూడా చెప్తూ ఉంటారు. తరచూ సామాన్యుల ఆలోచనలకు అద్దం పట్టేలా ఉండే వీడియోలను పంచుకోవడమే కాకుండా.. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు కూడా ఎంతో ఓపికగా సమాధానాలు చెప్తూ ఉంటారు.