Veera Simhareddy : నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీలో బాలయ్య రెండు పాత్రల్లో దుమ్ములేపారు. శృతి హాసన్, హనీరోజ్లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందించగా, సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్క్ను క్రాస్ చేసి బాలయ్య కెరీర్లో మరో బ్లాక్బస్టర్ మూవీగా నిలిచింది.
ఇక ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే 104 కోట్ల రూపాయలు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. కాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఎనిమిదో రోజు వసూళ్లతో మరో అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. బాలయ్య లాస్ట్ మూవీ అఖండ లైఫ్టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసి, ఎనిమిదో రోజున వీరసింహారెడ్డి వీరవిహారం చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.60 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టి, ఓవర్సీస్తో పాటు రెస్టాఫ్ ఇండియాలో ఎనిమిదో రోజున మరో రూ.10 కోట్లతో.. మొత్తంగా రూ.70 కోట్ల షేర్ వసూళ్లతో అఖండ వసూళ్లను దాటేసింది.
కాగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్కు చేరుకోవాలంటే మరో రూ.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టాల్సి ఉంది. దీంతో ఆ మార్క్ ను ఈజీగా క్రాస్ చేస్తుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. కాగా ఈ మూవీతో పాటు రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం గమనార్హం.