మాచో హీరో గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’. ఎ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా థాంక్స్ మీట్ నిర్వహించింది. దర్శకులు మారుతి, సంపత్ నంది ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
థాంక్స్ మీట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాకి చాలా మంచి ప్రసంశలు వచ్చాయి. సినిమా చాలా బావుంది, రెండు క్యారెక్టర్స్ లో చక్కని వేరియేషన్స్ చూపించారని మంచి అప్లాజ్ వచ్చింది. ఇంకా చూడని వారంతా థియేటర్స్ కి వెళ్లి చూడండి. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఎక్స్ ట్రార్డినరీగా వుంటుంది. గ్రాఫిక్స్, యాక్షన్, కామెడీ అద్భుతంగా వుంటాయి. మా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మారుతి, సంపత్ నంది గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఇంత మంచి కథ తీసుకొచ్చి, ఆడియన్స్ కి ఏం కావాలో అలాంటి మంచి కమర్షియల్ ప్యాక్డ్ సినిమా ఇచ్చిన హర్షకి థాంక్స్. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించి ఇంత మంచి సినిమా ఇచ్చిన రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పరీక్షలు అయిపోయాయి. ఇంకా చూడనికి ప్రేక్షకులు తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’ తెలిపారు.