Vikram Gokhale : బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమం లోనే ఆరోగ్య పరిస్థితి విషమించి నవంబర్ 26న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విక్రమ్ మరణంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు షాకయ్యారు. ఆయన మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన విక్రమ్ కొద్ది రోజులుగా కోమాలో ఉన్నారు. ఇటీవల ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అంత లోనే ఆరోగ్య పూర్తిగా విషమించి ఈరోజు కన్నుమూశారు. విక్రమ్ గోఖలే 1971లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పర్వానా’ సినిమాతో కెరీర్ని ప్రారంభించారు. ఆయన హిందీ, మరాఠీ చిత్రాల్లో అద్భుతంగా నటించారు. అంతేకాకుండా ‘భూల్ భులయ్యా’, ‘మిషన్ మంగళ్’, ‘దే దానా దాన్’, ‘హిచ్కీ’, ‘నికమ్మ’, ‘అగ్నీపథ్’, హమ్ దిల్ దే చుకే సనమ్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో నటించారు. విక్రమ్ గోఖలే పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విక్రమ్ గోఖలే చివరిగా ‘నికమ్మ’ చిత్రంలో శిల్పా శెట్టి, అభిమన్యు దాసానితో కలిసి కనిపించారు.
కాగా ఇటీవలే గోఖలే మృతి చెందక ముందు సామన్యులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా ట్విట్టర్ వేదికగా గోఖలే మృతికి సంతాపం కూడా తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో గోఖలే కుటుంబం కూడా ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఆ నోట్ లో విక్రమ్ గోఖలే ఇంకా బతికే ఉన్నారు. ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారు. వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు.