Entertainment : కోలీవుడ్ ట్రెండింగ్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్ జూన్ 9న వివాహ బంధంతో ఒకటయ్యారు అయితే ఈ జంట సోమవారం పండంటి కవలలకు తల్లిదండ్రులమైనట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయంపై వీరిద్దరూ క్లారిటీ ఇవ్వకపోయినా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చినట్టు అర్థమవుతుంది.. అయితే ఈ నేపథ్యంలో సరోగసి మరొకసారి చచ్చిన అంశం అయింది దీని ద్వారా తల్లిదండ్రులైన కొందరు సెలబ్రిటీల కోసం తెలుసుకుందాం..
టాలీవుడ్ నటి మంచి మోహన్ బాబు కుమార్తె అయిన మంచు లక్ష్మి సరోగసి ద్వారా ఓ ఆడ బిడ్డను కన్నారు. గుజరాత్కు చెందిన ఓ మహిళ ద్వారా.. ఈమె బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తుంది.. బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఒక పాపను దత్తత తీసుకున్నారు. తర్వాత ఇద్దరు మగ పిల్లలను సరోగసి పద్ధతిలో కన్నారు.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, గౌరీ దంపతులు ఇద్దరు పిల్లల తర్వాత మూడో కుమారుడిని సరోగసి ద్వారా పొందారు. ఆ బాబు పేరు అబ్రామ్ ఖాన్. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు కూడా సరోగసి ద్వారా కుమారుడికి జన్మనిచ్చారు. పేరు ఆజాద్ రావ్. బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా కూడా ఇదే విధానంలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే హిందీ నటుడు తుషార్ కపూర్ కూడా సరోగసి ద్వారా ఓ కొడుకును కన్నాడు ఈ బాబుకు లక్ష్యా అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు అయితే తుషార్ కపూర్ పెళ్లి చేసుకోలేదు.. అలాగే ఆయన సోదరీ అయినా ఏక్తాకపూర్ కూడా ఈ రకంగానే ఓ బిడ్డను కన్నది అయితే వీరిద్దరికీ సరోగేట్ మదర్ ఒకరే కావటం విశేషం..
అలాగే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తనకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదంటూ పెళ్లి చేసుకోకుండా సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు..