Entertainment ఒకప్పటి హాస్యనటి పాకీజా ప్రస్తుతం ఎలాంటి దినస్థితిలో ఉన్నారో అందరికీ తెలిసిందే. తాజాగా అనుకోని పరిస్థితుల్లో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఆవిడ ఎదురవడంతో అసలు విషయం బయటపడింది. ఆ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు తినడానికి సైతం డబ్బులు లేవని చాలా ఇబ్బందిగా ఉందని ఏదైనా అవకాశాలు కల్పించాలని వేడుకున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన పలువురు టాలీవుడ్ నటులు ఆమెకు సాయం చేశారు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోలు సైతం ఆమెను ఆదుకున్నారు దీనిపై ఆమె తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపారు.
హాస్యనటి పాకీజా టాలీవుడ్ లో దాదాపు 50 పైగా చిత్రాలలో నటించారు. ముఖ్యంగా బ్రహ్మానందంతో ఆమె పండించిన కామెడీ ఎప్పటికీ మర్చిపోనిది అయితే సినిమాల నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆమె పరిస్థితి దీనంగా మారింది. ఆదుకునే వాళ్ళు లేక ఉన్నదంతా ఖర్చు అయిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడులో జీవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక యూట్యూబ్ వాళ్ళకి ఎదురయ్యి తన మనసులో బాధను వెల్లడించారు. అలాగే సాయం చేయాలని తమిళ ఇండస్ట్రీని కోరానని కానీ ఎవరూ తనకు సహాయం చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. దీంతో టాలీవుడ్కు చెందిన ఎందరో ప్రముఖుల ఆమెకు సాయం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఆమెకు లక్ష రూపాయలు సహాయం చేయగా.. మెగా బ్రదర్ నాగబాబు లక్ష రూపాయలు అందించారు. అలాగే మోహన్ బాబు సైతం తనదైన రీతులో సహాయం చేశారు. అలాగే ఆమె అకౌంట్ నెంబర్ చెప్పగా అందరూ వెయ్యి రూపాయల నుంచి పదివేల వరకు తన సహాయం చేస్తూ వచ్చారని మీరు అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇంత సహాయం చేసిన మెగా హీరోలా కాళ్లు పట్టుకోవాలని ధన్యవాదాలు చెప్పాలని ఉందంటూ తెలిపారు..