Crime News : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ నీచుడు… తల్లితో సహజీవనం చేస్తూ ఆమె ఆరేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రిలా చూసుకోవాల్సిన వ్యక్తే ముక్కుపచ్చలారని ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేశాడు. అంతే కాకుండా ఈ దారుణ ఘటనను వెలుగులోకి రానివ్వకుండా… చిన్నారిది సహజమరణంగా చిత్రీకరించేందుకు కూడా కుట్ర పన్నాడు. ఈ షాకింగ్ ఘటన గురించి పూర్తి వివరాలు…
కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ భర్తను కోల్పోయి ఆరేళ్ల కూతురితో కలిసి జీవిస్తోంది. వ్యవసాయ కూలీగా పనిచేసే ఆమె మరికొందరు కూలీలతో కలిసి ఇటీవల డిచ్ పల్లి మండలంలోని ధర్మారం గ్రామానికి నాలుగు నెలల క్రితం వలస వచ్చింది. ఈ తరుణం లోనే ఒంటరిగా జీవిస్తున్న ఆమెపై స్థానికంగా నివసించే గోవింద్ రావు దగ్గరయ్యాడు. వారం రోజుల క్రితం ఆరేళ్ల వయసున్న ఆ మహిళ పెద్ద కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారికి తీవ్ర రక్త స్రావం కావడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. తర్వాత బాలిక తలపై రాయితో కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.
సదరు మహిళ ఇంటికి వచ్చి చూసేసరికి బాలిక స్పృహతప్పి పడి వుండటాన్ని చూసి నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా వుండటంతో హైదరాబాద్ నీలోఫర్ కు తరలించాలని డాక్టర్లు సూచించగా… అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. పోస్టుమార్టం జరిగితే అత్యాచారం విషయం బయటపడుతుందని గోవింద్ రావు భావించి… మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే హాస్పిటల్ సిబ్బంది డిచ్ పల్లి పోలీసులకు సమాచారం అందించగా వారు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా… రిపోర్ట్ లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బాలిక తల్లితో పాటు ఆమె సహజీవనం చేస్తున్న గోవింద్ రావు ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. బాలికపై తానే అత్యాచారానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో ఫోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుదిని జయలుకి తరలించారు.