Viral Video : అందరు కోపంలో ఏం చేస్తారో తమకే తెలియకుండా ప్రవర్తిస్తారు.. ఆ కోపంలో ఎంత ఖరీదైన వస్తువైనా చూడరు.. కష్టపడి పని చేసే వాళ్ళు ఎంతగా కష్టపడతారో.. వాళ్ళ కష్టాన్ని తగిన ప్రతిఫలం అందకపోతే అంతే బాధపడతారు. ఇలాంటి ఓ సంఘటనే ఉత్తరప్రదేశ్ నాయిడాలో చోటు చేసుకుంది. తనతో కూలి పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహంతో ఓ వ్యక్తి తన యజమాని మెస్సిడోస్ కారును తగలబెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది..
ఏమైందో అయితే పూర్తి విషయాలు తెలియకపోయినా.. తనతో పని చేయించుకొని సరైన డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో బయట ఉన్న యజమాని మెస్సిడోస్ కారును పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని మేంపూర్ లో జరిగిన ఘటన ప్రస్తుతం సంచలనం కల్గిస్తోంది. అక్కడే నిల్చని చూస్తున్న ఓ వ్యక్తి మాత్రం ఏమీ అనలేక అలా చూస్తూనే ఉండిపోయాడు.. ఈ సంఘటన అంతా సీసీటీవీలో రికార్డు అయింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఈ సంఘటన చూసిన కొందరు ఆగ్రహానికి గురౌతున్నారు. అంత ఖరీదైన కారణం తగల పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని కొందరు అంటుంటే.. మరి కొందరేమో కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోతే ఏం చేస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.