Movie ప్రభాస్ ప్రధాని పాత్రలో నటిస్తున్న ఆదిపురుష్ టీజర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే అయితే ఈ టీజర్ పై పలు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు దీనిపై తాజాగా విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది..
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష చిత్రంపై పలు సంఘాల అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే టీజర్ విడుదలైన దగ్గర నుంచి కొందరు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సినిమా ఉండబోతుందని ఆ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాకుండా ఇది ఏదో యానిమేటెడ్ కథల ఉందని నిజమైన రామాయణ కథలా లేదంటూ విమర్శలు వచ్చాయి.. అయితే దీనిపై మొత్తం చిత్ర బృందానికి ఢిల్లీ హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది.. ఈ విషయం చిత్ర బృందానికి పెద్ద షాక్ అనే చెప్పాలి..
రాముడు రావణుడు హనుమంతుని కోసం పూర్తిగా తెలుసుకొని రామాయణ సంబంధిత సినిమాలు తీయాలంటూ విమర్శలు ఎదురవుతున్నాయి అంతేకాకుండా ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపిస్తూ కొందరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ పిటిషన్ వేశారు.. అంతేకాకుండా ఆదిపురుష్ చిత్రంపై స్టే విధించాలని కోరారు.. ఈ విషయంపై సోమవారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తాజాగా ప్రభాస్ తో పాటు చిత్ర బృందానికి దానికి నోటీసులు ఇచ్చింది..