Entertainment డైరెక్టర్ రాజమౌళి ఒక సంచలనం కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాఫ్ కూడా లేకుండా అన్ని బ్లాక్ బ్లాస్టర్లు తీసిన దర్శకుడు మన జక్కన్న. తీసిన సినిమాలు అన్నిటినీ సూపర్ డూపర్ హిట్ చేయడమే కాకుండా.. సినీ విమర్శకులు ప్రశంసలు అందుకోగల సత్తా ఉన్న డైరెక్టర్ రాజమౌళి.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక మార్కును ఏర్పరుచుకున్న ఆయన.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. ఇటీవల కెనడాలోని టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు అతిథిగా వెళ్లిన జక్కన్న… ఇండియన్ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అక్కడ జక్కన్న భారతదేశం కోసం మన పురాణాల కోసం ఎంతో గొప్పగా వర్ణించారు అంతేకాకుండా ఇండియన్ ఫిల్మ్స్ ను ఓ గొప్ప స్థాయికి తీసుకెళ్లారు.. భారతదేశంలో ఎన్నో పురాణాలు ఉన్నాయని.. ఎంత లోతైన విషయాన్నైనా కథల రూపంలో చెప్పగల సామర్థ్యం మన భారతీయులకు ఉందని అన్నారు. మన పురాణాలు మహాభారతం, రామాయణాలు భారతదేశానికి అతి పెద్ద నిధులన్నారు. తాను చిన్నప్పటి నుంచి వాటిని వింటూ పెరిగానని.. వాటి ఆధారంగా ఎన్నో సినిమాలు తీయచ్చని తెలిపారు. అయితే వాటిల్లో ఉన్న విషయాలను ఉన్నది ఉన్నట్లు చెప్పాల్సిన అవసరం లేదని.. వాటిలో ఉన్న భావాన్ని పట్టుకుని దాని ఆధారంగా సినిమా తీసి ప్రేక్షకులకు అందించగలగాలన్నారు.. అయితే తెలుగు సినిమా కేవలం తెలుగు వారి కోసం మాత్రమే కాదు.. అందరి ఆదరణ పొందాలి.. అందుకే బాహుబలి లాంటి మూవీ తీశాము.. ఆ సినిమా ఖండాంతరాలు దాటిన తర్వాతే అందరికీ ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదనే విషయం అర్థమైందని అన్నారు.