Viral Video : చైనా తూర్పు తీరంలోని తైవాన్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది.. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.9 నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో…ఈ ప్రాంతంలోని అనేక భవానాలు పేకమేడల్లా కదిలిపోయాయి. అదే సమయంలో తైవాన్లోని ఓ రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన రైలు… బొమ్మలా అటూ ఇటూ కదిలిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఆ వీడియోలో స్టేషన్లోని కొంత మంది ప్రయాణికులు సైతం ఉండగా… ఒక్కసారిగా సంభవించిన ఘటనతో ఏం జరుగుతుందో తెలియక… బెంచిలు వెనుక నక్కి కూర్చున్న విజువల్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.
భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12:14 గంటలకు తైవాన్లోని యుజింగ్ నగరంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. తొలుత దీని తీవ్రత 7.2గా చూపిన అమెరికా జియోలాజికల్ సర్వే… తర్వాత 6.9గా మార్చింది. సరిగా ఇదే ప్రాంతంలో.. 24 గంటల వ్యవధిలో 12 సార్లు భూమి కంపించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే… ఇప్పుడు సంభవించిన భూకంపం తీవ్రతే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇలా వరుస భారీ భూకంపాలతో తైవాన్లోని పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. దాంతో.. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీస్తూ… ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తైవాన్లో భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ… తైవాన్ సమీపంలోని మారుమూల దీవులకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బీచ్ల్లో ఉండొద్దు అని, సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది. ఈ ప్రాంతాల్లో ఒక మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
An earthquake of magnitude 7.2 hit off the coast of Taiwan#Taiwan #earthquake #台湾地震 #臺灣 #地震 #台湾 pic.twitter.com/XS0p2iES4z
— Chaudhary Parvez (@ChaudharyParvez) September 18, 2022