డిజిటల్ ఎడిషన్ లకే ఇక ఈనాడు పరిమితం !
అన్ని పత్రికలదీ అదే దారి కానుందా..?
ఈనాడు ప్రింటింగ్ ను నిలిపేస్తున్న రామోజీరావు ?
తెలుగు పత్రికా రంగంలో ‘ఈనాడు’సంస్థ కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. అయితే కరోనా వైరస్ అన్ని రంగాలతో పాటు పత్రికా రంగాన్ని కూడా అతలాకుతలం చేసేసింది. దీనికి ‘ఈనాడు’కూడా మినహాయింపు కాదనే చెప్పాలి. దీంతో పాటు మీడియాలో మారుతున్న పోకడల కారణంగా అధినేత రామోజీరావు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఈనాడు’ పత్రికా ప్రింట్ను త్వరలోనే క్లోజ్ చేస్తారని ఆ సంస్థ ఉద్యోగులు బహిరంగంగానే చెప్తున్నారు.
భవిష్యత్లో ఈనాడు కేవలం ఆన్లైన్ ఎడిషన్కే పరిమితం అవుతుందని వారి మాటల సారాంశం. మరోవైపు రామోజీరావు ఔషధాల వ్యాపార రంగంలోకి దిగుతున్నట్లు టాక్ నడుస్తోంది.ఈ నేపథ్యంలో ‘ఈనాడు’దినపత్రిక జిల్లా కార్యాలయాలు ‘మెడికల్ డిస్ట్రిబ్యూటర్’ సంస్థలుగా మారబోతున్నాయని సమాచారం. ఈ మేరకు భారత్ బయోటెక్ సంస్థతో ఒప్పందం కూడా జరిగిందట.
ఇప్పటికే గుంటూరు యూనిట్లో పత్రిక ప్రింట్ను ఔట్సోర్సింగ్కు అప్పగించారు. ఔట్ సోర్సింగ్ ద్వారా అయితే ఉద్యోగుల పీఎఫ్, గ్రాట్యూటీ, వేజ్ బోర్డు వేతన సిఫారసులు వంటి తలనొప్పులు ఉండవు. అందుకే త్వరలోనే తెలుగు రాష్ట్రాలలోని మరికొన్ని ప్రింటింగ్ యూనిట్లను ఔట్ సోర్సింగ్కు అప్పగిస్తారని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ ప్రక్రియ దశల వారీగా జరగనుందట. 2024 ఆగస్టు 10 వరకు మాత్రమే ఈనాడు ప్రింటింగ్ కొనసాగుతుందని, ఆ తర్వాత కేవలం ‘ఈనాడు’ను ఈ-పేపర్, డిజిటల్ ఎడిషన్లకు మాత్రమే పరిమితం చేస్తారని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పటికే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ధాటికి మెయిన్ స్ట్రీమ్ మీడియా విలవిలలాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే..