Fake News : సినిమా రంగానికి ప్రజాధరణ ఎక్కువ అనేది వాస్తవం. నటీనటులకు సంబంధించిన ప్రతి విషయం కూడా నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి మీడియా మరి పర్సనల్ గా కూడా ప్రవర్తిస్తుందనేది పలువురు నటీనటుల అభిప్రాయం. అలానే సినిమా తారల ఆరోగ్యానికి సంబంధించి కూడా వార్తలు బాగా వైరలవుతున్నాయి. కొన్నిసార్లు నటుల ఆరోగ్యం విషమించిందని, ఆస్పత్రిలో చేరారని సోషల్ మీడియా వేదికగా వదంతులు వ్యాపిస్తాయి. కొందరైతే చనిపోయారంటూ ఏకంగా పోస్టులు కూడా షేర్ చేస్తుంటారు. గతహంలో ప్రముఖ తెలుగు కమెడియన్ వేణు మాధవ్ విషయంలో కూడా ఇదే జరిగింది.
అలానే ఇటీవల ప్రముఖ బెంగాలీ నటి అండ్రిలా శర్మ విషయం లోనూ ఇదే రిపీట్ అయ్యింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే చనిపోయినట్లు పుకార్లు వచ్చాయి. ఇప్పుడు అలాంటిది ఘటనే మరొకటి చోటు చేసుకుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే మృతి చెందినట్లు నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 90కి పైగా హిందీతో, మలయాళం, గుజరాతీ సినిమాల్లో గోఖలే నటించారు. మిషన్ మంగళ్, భూల్ భులయ్యా, దిల్ సే, దే దానా దాన్, హిచ్కీ, నికమ్మ, బ్యాంగ్ బ్యాంగ్ వంటి హిట్ సినిమాల్లోనూ ఆయన కనిపించారు. సామన్యులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా ట్విట్టర్ వేదికగా గోఖలే మృతికి సంతాపం కూడా తెలిపారు.
అయితే ఈ నేపథ్యంలో గోఖలే కుటుంబం ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఆ నోట్ లో … విక్రమ్ గోఖలే ఇంకా బతికే ఉన్నారు. ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారు. వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. వైద్యుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన కోసం ప్రార్థించండి’ అని తెలిపారు. కాగా 77 ఏళ్లున్న విక్రమ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పుణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో విక్రమ్ చికిత్స పొందుతున్నారు.