Crime ఆడవారిపై ఎన్ని చట్టాలు వస్తున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ 15 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
ఓ 15 ఏళ్ల బాలికపై ఐదుగురు హత్యాచారం చేసిన ఘటన దేశాన్ని నివ్వెరపరిచింది. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఉత్తర ప్రదేశ్ లో మొరీదాబాద్ లో సెప్టెంబర్ 1న ఈ ఘటన జరిగింది.. ఓ బాలిక సెప్టెంబర్ 1న తన పక్క గ్రామంలో జరుగుతున్న సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ఐదుగురు యువకులు ఆమెను వెంబడించారు.. ఆమెను వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అక్కడ ఆమెపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.. బాలిక గట్టిగా అరవడంతో దగ్గరలో పొలంలో పనిచేసుకుంటున్న వారు రావడంతో వాళ్లంతా దూరంగా పారిపోయారు. తర్వాత బాలిక అలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిందంతా కుటుంబ సభ్యులకు చెప్పింది..
బాలిక నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.. అయితే ఈ విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో తాము కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదని.. బాలిక కుటుంబ సభ్యులు అంటున్నారు.. అయితే వచ్చిన కంప్లైంట్ పట్టుకొని మేము ఎంక్వయిరీ చేస్తే అలాంటిదేమీ లేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారని పోలీసులు అంటున్నారు..