Entertainment టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు ఇప్పటికే ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకునే ఈ హీరో వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు అలాగే తండ్రి కాబోతున్న విషయాన్ని కూడా తాజాగా సోషల్ మీడియా వేదిక తెలియజేసి తన ఆనందాన్ని తెలిపాడు అయితే ఈ నేపథ్యంలో మరో అరుదైన గౌరవాన్ని రాంచరణ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో కలిసి తాజాగా ఒకే వేదికపై రామ్ చరణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.. డిసెంబర్ 14వ తేదీన గుజరాత్లోని అహ్మదాబాద్ లో జరగనున్న ప్రముఖ స్వామి మహారాజ్ జన్మ శతాబ్ది ఉత్సవాల్లో రామ్ చరణ్ ప్రధాని మోదీతో వేదికను పంచుకోవడానికి సిద్ధమయ్యారు.. ఈ కార్యక్రమానికి మోడీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో ప్రముఖులు వస్తూ ఉండగా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కు మాత్రమే ఆహ్వానం అందిందని తెలుస్తోంది అయితే రామ్ చరణ్ లో ఉన్న భక్తి భావాలు ఆధ్యాత్మిక భావన ఎందుకు దోహదం చేశాయని చెప్పవచ్చు తెలుగు నుంచి రామ్ చరణ్ కు మాత్రమే ఆహ్వానం అందిందని సమాచారం..
ఈ క్రమంలో అహ్మదాబాద్లోని ఒగనాజ్లో ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. పీఎస్ఎమ్ 100 పేరుతో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుండి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. BAPS అధినేత మహంత్ స్వామి సమక్షంలో డిసెంబర్ 14న సాయంత్రం ఐదు గంటలకు ఈ ఉత్సవాలు ప్రారంభం అవనునన్నాయి.























