Crime ఇద్దరు భార్యాభర్తలు కొన్నాళ్ల క్రితం విడిపోయారు అయితే ఎవరి జీవితం వాళ్ళ బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ఆ మాజీ భర్త మరలా ఆమె జీవితంలోకి రావాలని చూశాడు అంతేకాకుండా ఆమెను మానసికంగా వేధించడమే కాకుండా అత్యాచారం కూడా చేశాడు ఈ విషయంపై బాధితురాలు కోర్టులో కేసు వేసింది ఇందుకుగాను కోర్టు వేసిన శిక్షణ చూసి అందరూ అవాక్కవుతున్నారు..
భార్యాభర్తలుగా కొన్నాళ్లు కలిసి ఉన్న వాళ్ళు విడిపోయాక ఆ భర్త చేసిన పనికి బాధితురాలు కోర్టులో కేసు వేసింది అత్యాచారం కేసు కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది అయితే ఈ విషయంపై కోర్టులో 2020 నుంచి కేసు నడుస్తుంది తాజాగా ఈ విషయంపై తీర్పు చెప్పిన కోర్టు విచిత్రమైన శిక్షను విధించింది. వారిద్దరూ ముందు భార్యాభర్తలు కావడం వల్ల కేసును సామరస్యంగా పరిష్కరించే అవకాశాన్ని ఇచ్చింది.. ఇరుపాక్షాలు ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటాం అని తెలపడమే కాకుండా కోర్టుకు క్షమాపణలు తెలిపారు.. కోర్టు బాధితురాలికి రెండు రోజుల్లోనే 4.5 లక్షల నగదును ఇవ్వాలని తెలిపింది.. అలాగే ఇన్నాళ్ళు కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు కోపగించుకుంది.. ఆ నిందితుడికి నోయిడాలో రెండు బర్గర్ షాపులు వున్నందున.. రెండు అనాథాశ్రమాలకు కనీసం 100 మందికి రుచికరమైన, పరిశ్రుభమైన బర్గర్లను అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఇరువు పక్షాలు కేసును సామరస్యంగా పరిష్కరించుకున్నాయి అంతేకాకుండా ఎస్ ఐ ఆర్ నో రద్దు చేస్తే తనకు ఎలాంటి సమస్య లేదని మాజీ భార్య తెలిపింది..