Jahnvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్ళు గడుస్తున్నప్పటికీ ఈ భామకి సరైన హిట్ పడలేదనే చెప్పాలి. వయసుకి మించిన పాత్రల్ని ఎంచుకోవడమే ఆమె చేస్తున్న పెద్ద తప్పిదమని బాలీవుడ్ లోని ప్రముఖులు విమర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని ఆమె వరుసగా ఎంచుకోవడం కూడా మరో కారణం అని చెబుతున్నారు. ఇటీవల జాన్వీ నటించిన ” మిలీ ” కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీనే.
కానీ అనుకోని రీతిలో బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా బోల్తా కొట్టడంతో ఈ అమ్మడు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచనలో పడిందని తెలుస్తుంది. జాన్వీ కపూర్కి కొంతకాలం క్రితం నుంచే టాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కానీ తన ఫస్ట్ ఛాయిస్ బాలీవుడ్ అంటూ ఆ ఆఫర్స్ని తిరస్కరించింది ఈ ముద్దుగుమ్మ. జాన్వీ కపూర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హైదరాబాద్తో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. అలానే టాలీవుడ్లో యాక్ట్ చేయాలనే ఇంటస్ట్ర్ని కూడా బయటపెట్టింది.
తెలుగులో నటించాలనేది నా కోరిక. తొందరగా ఆ కోరిక నెరవేరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. నేను చిన్నప్పుడు హైదరాబాద్లో ఎక్కువ సమయం గడిపాను. నాన్న ఇక్కడ షూటింగ్ చేసేటప్పుడు నేను వచ్చేదాన్ని’’ అని జాన్వీ కపూర్ వెల్లడించింది. అలానే మిలీ నిరాశపరచడంపై మాట్లాడుతూ ‘మిలీ నుంచి ఎక్కువగా ఆశించాను. కానీ మేము ఆశించిన నంబర్లు కనిపించలేదు. అయితే.. ప్రేక్షకుల గౌరవం దక్కింది’’ అని చెప్పుకొచ్చింది. మిలీ సినిమా రూ.38 కోట్ల బడ్జెట్తో రూపొందగా బడ్జెట్లో 10% కూడా ఆ మూవీ రాబట్టలేదని సమాచారం.