Entertainment మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు చలనచిత్ర రంగంలో మెగాస్టార్ గా చిరకాలం హృదయాల్లో నిలిచిపోయే పేరు.. తన కెరీర్లో 150 కి పైగా సినిమాలు తీసి ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు చిరంజీవి.. అలాంటి ఈ స్టార్ హీరో నటుడుగా పుట్టి నేటికీ 44 సంవత్సరాల అయింది. చిరంజీవి మొదటి సినిమా అయిన ప్రాణం ఖరీదు ఈరోజునే విడుదలైంది.
చిరంజీవి నటుడుగా తెలుగు చిత్రశ్రమకు పరిచయమైన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. ఈ సినిమా సెప్టెంబరు 22, 1978లో విడుదలైంది. ఈ సినిమాతో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన చిరంజీవి.. తర్వాత ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు.. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్లో ఒక ఎమోషనల్ పోస్టును ఉంచారు ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది..
“మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టి నేటికీ 44 సంవత్సరాలు అయింది.. సెప్టెంబర్ 22, 1978లో మొదటిగా విడుదలైన నా ప్రాణం ఖరీదు మూవీకి ప్రాణం పోసి.. ప్రాణప్రదంగా నా ఊపిరై.. నా గుండె చప్పుడు గా 44 ఏళ్లుగా నన్ను నడిపించారు.. అంతగా నన్నింతగా ఆదరించి ఇప్పటికీ ఆదరిస్తున్న అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను” అంటూ రాసుకొచ్చారు. ఈ 44 ఏళ్లుగా ప్రేక్షకుల అభినందనలు పొందుతూ మెగాస్టార్ గా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు మన చిరు.
Chiranjeevi the Actor as you all know was born today, 22 September 1978, 44 years ago! I owe this limitless love and affection I receive from you all, to this day!
I owe everything to this day!
Humbled and Grateful! 🙏🙏🙏#PranamKhareedu #22Sept1978#DebutMovieRelease pic.twitter.com/LoFcpEo9Zo
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2022