ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్బంగా కొంపల్లి లోని తన నివాసం లో మొక్కలు నాటిన సిద్దిపేట వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ వంగ రాజేశ్వర్ రెడ్డి.
ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… తన పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఒక వృక్షానికి రిప్లాంటేషన్ కి అయ్యే కర్చుని తానే బరిస్తానని తెలియజేస్తూ .తెలంగాణ లో గ్రీనరి పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అన్నారు.ఈ అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తన కూతురు అకీరా, అన్న కూతురు ఆధ్య పాల్గొన్నారు.