పెళ్లి జరిగిన నాలుగు నెలలకే ఇద్దరు మగ కవలలకు తల్లిదండ్రులు అయ్యారు నయన్ విగ్నేశ్ శివన్ జంట. ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట జూన్లో పెళ్లి చేసుకున్నారు. అక్టోబరులో ఇద్దరు పిల్లలు పుట్టారని ప్రకటించారు. ఒక వేళ నయన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యిందేమో అనుకుందాం.. అంటే ఆ లక్షణాలే ఆమెలో లేవు. పైగా ఇటీవలే గాడ్ ఫాదర్ మూవీలోనూ నటించింది. దీంతో అందరూ ఈ జంట సరోగసి పద్థతిలో తల్లిదండ్రులు అయ్యారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తుల దుమారం రేగింది. ఇదే వీరిని వివాదంలో చిక్కుకునేటట్లు చేసింది. తాజాగా సరోగసి పద్థతిని ఆశ్రయించినందుకు కోర్టుకు వివరణ కూడా చెప్పుకున్నారు ఈ జంట. అందులో షాకింగ్ విషయాలు వెల్లడించారు.
ఇండియాలో సరోగసి విధానంపై నిషేధం ఉంది. అలాంటప్పుడు వీరిద్దరూ ఎలా పిల్లల్ని కన్నారని చాలా మంది ప్రశ్నించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం నయన్, విగ్నేశ్ శివన్లకు వివరణ కోరింది. దీంతో వీరిద్దరూ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో ఈ జంటకు 6 సంవత్సరాల క్రితమే రిజిస్టార్ మ్యారేజ్ జరిగిందని తెలిపారు. అందుకు సంబంధించిన సర్టిఫికేట్ను జతచేశారు. సరోగసికి సంబంధించిన అన్ని నిబంధనల ప్రకారమే గతేడాని డిసెంబరులో సరోగసి కోసం రిజిస్టర్ చేసుకున్నామని అఫిడవిట్లో స్పష్టం చేశారు. ఈ సరోగసికి యూఏఈలో ఉండే నయన్ దగ్గరి బంధువు సాయంతో పిల్లల్ని కన్నామని తెలిపారు.