Entertainment ఈ ఏడాది జూన్ 9న డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ను వివాహమాడిన నయనతార ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
నయనతార విగ్నేశ్ శివన్ ఇద్దరూ కవల పిల్లలకు జన్మనిచ్చారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులంతా షాకు గురయ్యారు అదేంటి నిన్నకాక మొన్ననే కదా వీరిద్దరికి పెళ్లి అయింది అది కాక నయనతారను గాడ్ ఫాదర్ మూవీ లో చూశాం కదా అంటూ షాక్ గురయ్యారు అయితే అసలు విషయం ఏంటంటే వీరిద్దరూ సరోగసి పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చారు.. తమ పిల్లల కాళ్లను ముద్దాడుతున్న ఫొటోలను విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
అయితే నిజానికి నయనతార గర్భం దాల్చలేదు. ఆమె స్వయంగా పిల్లల్ని కనలేదు. కానీ, ఆమె మాత్రం తల్లయ్యారు. ఆమె సరోగసీ పద్ధతిలో తల్లయ్యారు. ఈ విషయాన్ని బయటికి వెల్లడించకపోయినా అర్థమైపోతుంది. తాము కవల పిల్లలకు తల్లిదండ్రులమైనట్టు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చిన్నారుల పాదాలను నయనతార, తాను ముద్దాడుతున్న ఫొటోలను సైతం పోస్ట్ చేశారు. ‘‘నయన్, నేను అమ్మ, నాన్న అయ్యాం. మాకు కవల మగ బిడ్డలు జన్మించారు. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలతో మంచినంతా కలుపుకుని ఇద్దరు బిడ్డలు మాకు కలిగారు. వారికి మీ ఆశీస్సులు కావాలి’’ అని విఘ్నేష్ శివన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కవలలకు ఉయిర్, ఉలగం అని పేర్లు కూడా పెట్టారు.
https://twitter.com/VigneshShivN/status/1579094363095052288?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579094363095052288%7Ctwgr%5Ee93567702546365e4a6d006e3aff9a81caf1bbf4%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Fandhra-pradesh%2Fnews%2Fttd-eo-dharma-reddy-says-that-devotees-will-accommodate-in-tirupati%2Farticleshow%2F94742380.cms