Movie టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన నువ్వే నువ్వే సినిమాకు 20 ఏళ్లు పూర్తయ్యాయి.. దాదాపు రెండు దశాబ్దాలు పుర్తి చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీలోని కొన్ని ఫేమస్ డైలాగ్స్ ఏంటో ఓ సారి చూద్దాం..
డబ్బుతో బ్రెడ్ కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ కొనగలరు, నిద్రని కొనలేరు.
ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు… ఎలా వెళ్లాలో చెప్పడానికి నేనెవర్ని?
మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్లు. మనం ఏం చేసినా భరించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు.
నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20 నాకు, 80 వాడికి. ఇంకో పదిహేను మార్కులు వేసి మీ నాన్నను పాస్ చేయలేవమ్మా?
అమ్మ, ఆవకాయ్, అంజలి… ఎప్పుడూ బోర్ కొట్టవు.
కన్నతల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరకు రావాలని కోరుకోవడం మూర్ఖత్వం.
ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు… పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు.
నేను దిగడం అంటూ మొదలుపెడితే ఇది మొదటి మెట్టు. దీని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి.
సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు.
తాజ్ మహల్… చార్మినార్… నాలాంటి కుర్రాడు చూడటానికే! కొనడానికి మీలాంటి వాళ్ళు సరిపోరు.
ఒకడు రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని… వారి కొడుక్కి కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమనడం అంత బాగుండదు.
ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్లు ఏడుస్తారు. పెళ్లి చేసుకొని వెళ్లేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు.
డబ్బులు ఉన్నవాళ్ళంతా ఖర్చుపెట్టలేరు. ఖర్చు పెట్టేవాళ్లంతా ఆనదించలేరు.