ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోన్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా రానున్న ఈ మూవీ టీజర్ దసరా సందర్భంగా అక్టోబరు 2న ఆయోధ్య రామయ్య సన్నిధిలో రిలీజ్ అయ్యింది. మిశ్రమ టాక్ దక్కించుకున్న ఈ టీజర్లో ఎక్కువగా గ్రాఫిక్స్ ఉన్నాయి. విజువల్స్ చూస్తే హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తున్నాయని, వీఎఫ్ఎక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
డైరెక్టర్ అలా చేయడంతో..
డైరెక్టర్ ఓంరౌత్ గ్రాఫిక్స్కు సంబంధించిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఎన్వై వీఎఫ్ఎక్స్వాలాకు ఈ మూవీ టీజర్ను ట్యాగ్ చేశారు. దీంతో నెటిజన్లు ఈ సంస్థే గ్రాఫిక్స్ చేసిందని భావించి వీఎఫ్ఎక్స్ వాలా అనే ఎకౌంట్ను ట్యాగ్ చేస్తూ గ్రాఫిక్స్ ఇంకాస్త మెరుగుగా ఉంటే టీజర్ అదరగొట్టేది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఎన్వై వీఎఫ్ఎక్స్వాలా ప్రకటన
దీంతో వీఎఫ్ఎక్స్ సంస్థ ఎన్వై వీఎఫ్ఎక్స్వాలా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదిపురుష్ సినిమాకు తాము గ్రాఫిక్స్ అందించలేదని.. ఈ సినిమాకు మాకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. మూవీకి సంబంధించిన సీజీ లేదా ఇతర ఏ ఎఫెక్ట్స్ మేము చేయలేదు అని తాజా ప్రకటన రిలీజ్ చేసింది బాలీవుడ్ స్టార్ అజయ్దేవ్గణ్కు చెందిన ఎన్వై వీఎఫ్ఎక్స్ వాలా సంస్థ.